యూఏఈ వాసులకు గుడ్ న్యూస్.. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
- September 27, 2023
యూఏఈ: యూఏఈ వాసులకు భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. 75,000 టన్నుల మేర బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని యూఏఈకి ఎగుమతి చేసేందుకు అనుమతించింది. జూలై 20 నుండి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధిం విధించిన విషయం తెలిసిందే. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా యూఏఈకి ఎగుమతులు అనుమతించబడుతున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సోమవారం సాయంత్రం తన నోటిఫికేషన్లో తెలిపింది. సింగపూర్కు “ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి” బియ్యం ఎగుమతిని అనుమతించాలని గత నెలలో భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్, యూఏఈ, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కోట్ డి ఐవోయిర్, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటి, మడగాస్కర్, కామెరూన్ సోమాలియా, మలేషియా మరియు లైబీరియాలు బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల