జనసేన పార్టీ బహ్రెయిన్ కన్వీనర్ గా రాయుడు వెంకటేశ్వరరావు
- September 29, 2023
మనామా: జనసేన పార్టీ బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా ఆలమూరు మండలం చెముడు లంక గ్రామానికి చెందిన రాయుడు వెంకటేశ్వరరావును నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.జనసేన పార్టీ గల్ఫ్ దేశాల ప్రాంతీయ కన్వీనర్లను నియమిస్తూ గురువారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు.దీనిలో భాగంగా బహ్రెయిన్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన రాయుడు వెంకటేశ్వరరావు గల్ఫ్ దేశాల జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నారు.పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నరాయుడు వెంకటేశ్వరరావు సేవలను పార్టీ గుర్తించి బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.బహ్రెయిన్ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన రాయుడు వెంకటేశ్వర రావు ను కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు అభినందించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









