బహ్రెయిన్లో ఐఐటీ మద్రాస్ సర్టిఫికేషన్ కోర్సులు ప్రారంభం
- October 02, 2023
బహ్రెయిన్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్తో ఔట్రీచ్ భాగస్వామి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో విభిన్న శ్రేణి ధృవీకరణ ప్రోగ్రామ్లను అందించనున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో అధికారిక సంతకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోడి, డిజిటల్ స్కిల్స్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మగల సుందర్ పాల్గొన్నారు. మెక్ఇండిజ్ కన్సల్టెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ పి ఉన్నికృష్ణన్, సీఈఓ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా ఉన్నారు. ఇదిలా ఉండగా.. బహ్రెయిన్లోని క్రౌన్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో అక్టోబర్ 2న బహ్రెయిన్లో పోర్టల్ ప్రారంభించబడుతుంది.
తాజా వార్తలు
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!







