బహ్రెయిన్లో ఐఐటీ మద్రాస్ సర్టిఫికేషన్ కోర్సులు ప్రారంభం
- October 02, 2023
బహ్రెయిన్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్తో ఔట్రీచ్ భాగస్వామి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో విభిన్న శ్రేణి ధృవీకరణ ప్రోగ్రామ్లను అందించనున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో అధికారిక సంతకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోడి, డిజిటల్ స్కిల్స్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మగల సుందర్ పాల్గొన్నారు. మెక్ఇండిజ్ కన్సల్టెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ పి ఉన్నికృష్ణన్, సీఈఓ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా ఉన్నారు. ఇదిలా ఉండగా.. బహ్రెయిన్లోని క్రౌన్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో అక్టోబర్ 2న బహ్రెయిన్లో పోర్టల్ ప్రారంభించబడుతుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









