బహ్రెయిన్లో ఐఐటీ మద్రాస్ సర్టిఫికేషన్ కోర్సులు ప్రారంభం
- October 02, 2023
బహ్రెయిన్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్తో ఔట్రీచ్ భాగస్వామి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో విభిన్న శ్రేణి ధృవీకరణ ప్రోగ్రామ్లను అందించనున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో అధికారిక సంతకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోడి, డిజిటల్ స్కిల్స్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మగల సుందర్ పాల్గొన్నారు. మెక్ఇండిజ్ కన్సల్టెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ పి ఉన్నికృష్ణన్, సీఈఓ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా ఉన్నారు. ఇదిలా ఉండగా.. బహ్రెయిన్లోని క్రౌన్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో అక్టోబర్ 2న బహ్రెయిన్లో పోర్టల్ ప్రారంభించబడుతుంది.
తాజా వార్తలు
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!
- గల్ఫ్ దేశాలకు మెడిటరేనియన్ పార్లమెంట్ ఫోరమ్ సంఘీభావం..!!
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉచితంగా పిల్లల స్ట్రోలర్లు..!!
- పాఠశాల పరీక్షల ఫలితాలు..ఎడ్యుకేషన్ పోర్టల్ మరియు తవక్కల్నా యాప్ లో..!!
- అక్రమ శాటిలైట్ ఛానళ్ల ప్రసార ముఠాను ఛేదించిన దుబాయ్ పోలీసులు







