వైద్యరంగంలో ఆడిట్.. పలువురు ఉద్యోగులు అరెస్ట్
- October 03, 2023
మస్కట్: ప్రభుత్వ సంస్థల్లో మరింత పారదర్శకత, సమగ్రత ఉండేలా రాష్ట్ర ఆడిట్ ఇనిస్టిట్యూషన్ (SAI) చేసిన క్యాంపెయిన్ గత సంవత్సరంలో ఫలితాలను ఇచ్చింది. 2022 వార్షిక నివేదిక ఫలితాలను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర ఖజానాకు మిలియన్ల కొద్దీ ఒమానీ రియాల్స్ నష్టం జరిగినట్లు తెలిపింది. చాలా మంది అవినీతి అధికారులు పట్టుబడ్డారని పేర్కొంది. ఖౌలా హాస్పిటల్లో జరిగిన అనేక అవకతవకల ను గుర్తించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఔట్ పేషెంట్ క్లినిక్లకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య సంస్థల ద్వారా మొత్తం 17,521 రెఫరల్లు జారీ చేయగా.. మరియు 2017 నుండి 2021 వరకు 12,018 శస్త్రచికిత్సలు షెడ్యూల్ చేయనట్టు గుర్తించారు.ఒక ప్రైవేట్ ఆరోగ్య సంస్థపై 19 ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే లైసెన్స్లు పొందకుండా లేదా గడువు ముగిసిన లైసెన్స్లతో వైద్య వృత్తి మరియు అనుబంధ వైద్య వృత్తులను నేర్చుకునేందుకు విజిటింగ్ డాక్టర్లను అనుమతించినట్లు తనిఖీల్లో గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ ఆరోగ్య సంస్థల్లో వైద్య వృత్తిని అభ్యసించడం వల్ల వైద్య వృత్తికి సంబంధించిన చట్టంలోని నిబంధనలను పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసిన లైసెన్స్తో ప్రాక్టీస్ చేస్తున్న పలువురు వైద్యులపై ఒక సంవత్సరంలో నాలుగు ఉల్లంఘనలు, ఒక వైద్యునిపై రెండు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







