అల్లు రామాయణం ముందుకు కదులుతోందా.?
- October 04, 2023
అప్పుడెప్పుడో రామాయణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్న తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారాయన. నిర్మాత మధుమంతెనతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు.
నితీష్ తివారి అందుకు స్ర్కిప్టు వర్క్ కూడా చేస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోందన్న వార్త హల్ చల్ చేస్తోంది.
అలాగే, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఇతిహాసాన్ని మూడు భాగాలుగా నితీష్ తెరకెక్కించాలనుకున్నాడనీ తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ఇతిహాసం రూపొందబోతోందట.
‘ఆది పురుష్’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఏ ఒక్క చిన్న విషయాన్నీ లైట్ తీసుకోకుండా దగ్గరుండి మరీ స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారట అల్లు అరవింద్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పర్ఫెక్ట్ టీమ్ పని చేస్తోందనీ తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ క్లారిటీ ఇవ్వనున్నారట. చూడాలి మరి, ఈ రామాయణం ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో.!
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







