అల్లు రామాయణం ముందుకు కదులుతోందా.?
- October 04, 2023
అప్పుడెప్పుడో రామాయణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్న తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారాయన. నిర్మాత మధుమంతెనతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు.
నితీష్ తివారి అందుకు స్ర్కిప్టు వర్క్ కూడా చేస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోందన్న వార్త హల్ చల్ చేస్తోంది.
అలాగే, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఇతిహాసాన్ని మూడు భాగాలుగా నితీష్ తెరకెక్కించాలనుకున్నాడనీ తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ఇతిహాసం రూపొందబోతోందట.
‘ఆది పురుష్’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఏ ఒక్క చిన్న విషయాన్నీ లైట్ తీసుకోకుండా దగ్గరుండి మరీ స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారట అల్లు అరవింద్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పర్ఫెక్ట్ టీమ్ పని చేస్తోందనీ తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ క్లారిటీ ఇవ్వనున్నారట. చూడాలి మరి, ఈ రామాయణం ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో.!
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









