నేటి నుంచి ఐసీసీ వరల్డ్ కప్ 2023. అభిమానుల కళ్లన్నీ ఆ జట్లపైనే

- October 05, 2023 , by Maagulf
నేటి నుంచి ఐసీసీ వరల్డ్ కప్ 2023. అభిమానుల కళ్లన్నీ ఆ జట్లపైనే

న్యూఢిల్లీ: ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా రేపటి నుండి నవంబర్ 19వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియాలోని మొత్తం పది వేదికల్లో మ్యాచ్ లు జరగనుండగా బీసీసీఐ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. షెడ్యూల్ లో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, గత వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన న్యూజిలాండ్ లో తలపడనున్నది... ఇక ఈ వరల్డ్ కప్ లో ఎవరు టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారన్న విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది. కాగా ప్రస్తుతం జట్లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఒకరు గెలిచే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  
వరల్డ్‌ కప్‌లో భారత్‌ జట్టు షెడ్యూల్‌  
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో (ఢిల్లీ)
అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో (అహ్మదాబాద్‌)
అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో (పూణే)
అక్టోబర్ 22న న్యూజిలాండ్‌ (ధర్మశాల)
అక్టోబర్ 29 ఇంగ్లాండ్‌తో (లక్నో)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com