అల్ బురైమిలో 777 విదేశీ కంపెనీల పెట్టుబడి
- October 05, 2023
అల్ బురైమి: ఈ ఏడాది అక్టోబర్ వరకు అల్ బురైమి గవర్నరేట్లో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2022లో 177 కంపెనీలతో పోలిస్తే 2023లో ఈ సంఖ్య 777గా ఉండటం విశేషం. అల్ బురైమి గవర్నరేట్లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ మాట్లాడుతూ..గవర్నరేట్లో విదేశీ పెట్టుబడుల కోసం నమోదు చేయబడిన మూలధనం OMR9 మిలియన్లకు పైగా ఉందని, పారిశ్రామిక సంస్థల సంఖ్య 584 అని చెప్పారు. ఇదిలా ఉండగా అల్ బురైమి గవర్నరేట్లో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 923గా ఉంది. ఇందులో వ్యక్తిగత వ్యాపార సంస్థల సంబంధించి 223 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఏకైక యాజమాన్యానికి చెందిన 363 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఇతర పరిమిత బాధ్యత కంపెనీలకు చెందిన 303 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







