అల్ బురైమిలో 777 విదేశీ కంపెనీల పెట్టుబడి
- October 05, 2023
అల్ బురైమి: ఈ ఏడాది అక్టోబర్ వరకు అల్ బురైమి గవర్నరేట్లో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య పెరిగినట్లు ఒమన్ వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2022లో 177 కంపెనీలతో పోలిస్తే 2023లో ఈ సంఖ్య 777గా ఉండటం విశేషం. అల్ బురైమి గవర్నరేట్లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ మాట్లాడుతూ..గవర్నరేట్లో విదేశీ పెట్టుబడుల కోసం నమోదు చేయబడిన మూలధనం OMR9 మిలియన్లకు పైగా ఉందని, పారిశ్రామిక సంస్థల సంఖ్య 584 అని చెప్పారు. ఇదిలా ఉండగా అల్ బురైమి గవర్నరేట్లో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య 923గా ఉంది. ఇందులో వ్యక్తిగత వ్యాపార సంస్థల సంబంధించి 223 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఏకైక యాజమాన్యానికి చెందిన 363 వాణిజ్య రిజిస్ట్రేషన్లు, ఇతర పరిమిత బాధ్యత కంపెనీలకు చెందిన 303 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









