సామాజిక భద్రతా పెన్షన్ SR1320కి పెంపు
- October 09, 2023
రియాద్: సామాజిక భద్రతా పింఛను SR1100 నుండి SR1320కి చేరుకునేలా 20 శాతం పెంచుతూ రాయల్ డిక్రీని జారీ చేసినట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు పెంచినట్లు తెలిపింది. పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో..వారి ఆర్థిక భారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి, కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ చైర్మన్ మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా రాజు పింఛను పెంపు ఆదేశాలను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సామాజిక భద్రత పెన్షన్ పెంపులో అర్హులైన కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ప్రతి కుటుంబానికి పెన్షన్ గరిష్ట పరిమితి SR5000 దాటకుండా జారీ చేస్తారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









