గాజా ముట్టడిని ఎత్తివేయాలని సౌదీ పిలుపు
- October 14, 2023
రియాద్: గాజా నుండి పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడాన్ని మానుకోవాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్నదాడులు పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించింది. పౌరులకు వ్యతిరేకంగా అన్ని రకాల సైనిక విపత్తులను అరికట్టాలని, గాజా నివాసితులకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించడంలో త్వరితగతిన జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. గాజాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు మరియు మానవతా సూత్రాలకు కట్టుబడి ఉండేలా ఇజ్రాయెల్ కు సూచించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అరబ్ పీస్ ఇనిషియేటివ్ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపన జరిగిందని, పాలస్తీనా సమస్యకు న్యాయమైన మరియు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడానికి అంతర్జాతీయ తీర్మానాలు, చొరవలకు అనుగుణంగా శాంతి ప్రక్రియకు కట్టుబడి ఉండాలని సౌదీ కోరింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









