వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420' టైటిల్‌ లోగో ఆవిష్కరణ

- May 22, 2016 , by Maagulf
వరుణ్ సందేశ్  'మిస్టర్ 420' టైటిల్‌ లోగో ఆవిష్కరణ

వర్ధమాన నటుడు వరుణ్‌ సందేశ్‌, ప్రియాంక భరద్వాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్‌ 420. ఈ చిత్ర టైటిల్‌ లోగోను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి రవికుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, హరికుమార్‌రెడ్డి గజ్జల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర్‌ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్‌సందేశ్‌ మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తారని తెలిపారు. చిత్రం ప్రస్తుతం చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉందని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రానికి ముస్తఫా సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com