ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- October 17, 2023
న్యూ ఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ సోమవారం రాత్రి భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ యొక్క నిబద్ధతపై జరిగిన సమావేశానికి సుందర్ పిచాయ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పిచాయ్ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగుల్ ప్రణాళిక గురించి చర్చించారు. భారతదేశంలో క్రోమ్బుక్లను తయారు చేయడంలో హెచ్పితో గూగుల్ భాగస్వామ్యాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రశంసించారు.
‘‘భారతదేశం పట్ల గూగుల్ నిబద్ధత గురించి, కృత్రిమ మేథ ద్వారా మా కార్యకలాపాలను ఎలా విస్తరింపజేస్తున్నాం అనే అంశం గురించి చర్చించడానికి ఈ రోజు జరిగిన సమావేశానికి ధన్యవాదాలు’’ అని సుందర్ పిచాయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. గూగుల్ 100 భాషల చొరవను ప్రధాన మంత్రి మోదీ ప్రశంసించారు. భారతీయ భాషలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను అందుబాటులో ఉంచే ప్రయత్నాలను మోదీ ప్రోత్సహించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







