ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం.. యూఎన్ తీరుపై యూఏఈ అసంతృప్తి!
- October 18, 2023
యూఏఈ: గాజాలోని పౌరులు మరోసారి యుద్ధాన్నిఎదుర్కొంటున్నారని యూఏఈ పేర్కొంది. యూఎన్ భద్రతా మండలి అత్యవసర మానవతా అవసరాలకు ప్రతిస్పందించడానికి కలిసి రాలేకపోయిందని తెలిపింది. పౌరులపై హింస మరియు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ.. రష్యా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యూఎన్ తిరస్కరించింది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన ఆకస్మిక దాడిలో 1,300 మంది ఇజ్రాయిలీలు మరణించారు. ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులలో 2,750 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఉత్తరాన ఉన్న గాజన్లు దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితిలో యూఏఈ శాశ్వత ప్రతినిధి లానా నుస్సీబెహ్ మాట్లాడుతూ.. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను తరలించడం అన్యాయమైన చర్యగా అభివర్ణించారు. గాజాలో 1.3 మిలియన్ల మందికి వారి ప్రాథమిక మనుగడ కోసం సహాయం అవసరమని ఆమె అన్నారు. ఇంధనం, ఆహారం, నీరు, వైద్య సహాయం మరియు ఇతర ప్రాథమిక అవసరాలకు వారు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్లు తమ స్వంత స్వతంత్ర, సంపన్నమైన , సురక్షితమైన రాష్ట్రాల్లో జీవించేందుకు యూఏఈ మద్దతు ఇస్తుందని తెలిపారు. రెండు అభివృద్ధి చెందాలని యూఏఈ ఆకాంక్ష అని నుస్సీబే అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









