గాజా ఆసుపత్రిపై దాడిని ఖండించిన యూఏఈ
- October 18, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్లోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ఆస్పత్రిలోని వందలాది మంది ప్రజలు మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ దాడిలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని, పౌరులు మరియు పౌర సంస్థలు లక్ష్యంగా చేసుకోకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ చెప్పింది. అంతర్జాతీయ మానవతా చట్టం, పౌరులు మరియు మానవ హక్కుల రక్షణ కోసం అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలని కోరింది. పౌరుల రక్షణ ప్రాముఖ్యతను గుర్తించాలని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!







