రామ జన్మభూమి: విదేశీ విరాళాలు సేకరించేందుకు అనుమతి
- October 19, 2023
అయోధ్య: విదేశాల నుంచి విరాళాల సేకరణకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద హోం శాఖ ఈ అనుమతులు జారీ చేసినట్టు ట్రస్ట్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 11 సంన్సద్ మార్గ్ బ్రాంచ్లోని ట్రస్ట్ అకౌంట్లలో విరాళాలు జమ చేయవచ్చని పేర్కొంది. ఈ అకౌంట్ మినహా మరే ఇతర బ్రాంచీల్లోనూ విదేశీ విరాళాలు అందించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ దేశంలో నలుమూలల నుంచి వచ్చిన విరాళాలను మాత్రమే తీసుకుంది ట్రస్ట్. ఇకపై విదేశాల నుంచీ విరాళాలు సేకరించేందుకు లైన్ క్లియర్ అయింది. Foreign Contribution Regulation Act (FCRA) 2010 కింద విదేశాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు వీలవుతుంది. ఇన్నాళ్లూ అందుకు కేంద్ర హోం శాఖ దీనిపై ఆంక్షలు విధించింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విదేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చినట్టు తెలిపింది.
FCRA సెక్షన్ కింద ఓ స్వచ్ఛంద సంస్థ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్ప విదేశాల నుంచి విరాళాలు తీసుకోడానికి అవకాశముండదు. ఈ ఏడాది జూన్లో FCRA లైసెన్స్ కోసం అప్లై చేసింది ట్రస్ట్. దాదాపు 2020 నుంచి ట్రస్ట్ ఈ విరాళాలు సేకరిస్తోంది. భక్తులు, ఆసక్తి ఉన్న వాళ్ల నుంచి వీటిని తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 21-24 మధ్యలో రామ మందిరం తెరుచుకోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య ఏ రోజు అయినా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని, కచ్చితమైన తేదీని ప్రధాన మంత్రి కార్యాలయం ఇంకా తెలియజేయలేదని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్ పర్సన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ ఉండవచ్చని తెలిపారు. ఈ భవ్య మందిరాన్ని మూడంతస్తుల్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అవుతుందని సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







