భవనం పైనుంచి పడి 5 ఏళ్ళ బాలిక మృతి

- May 22, 2016 , by Maagulf
భవనం పైనుంచి పడి 5 ఏళ్ళ బాలిక మృతి


ఐదేళ్ళ బాలిక ఓ అపార్ట్‌మెంట్‌లోని ఎనిమిదవ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. గ్రీన్స్‌ కమ్యూనిటీ ఎదురుగా ఉన్న టెకామ్‌ నూర్‌ 1లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దుబాయ్‌ పోలీస్‌ చీఫ్‌ అసిస్టెంట్‌ మేజర్‌ జనరల్‌ ఖలీల్‌ ఇబ్రహీమ్‌ అల్‌ మన్సౌరి మాట్లాడుతూ భారతదేశానికి చెందిన ఆ బాలిక, కిటికీలోంచి కిందికి తొంగి చూస్తూ కిందికి పడిపోయినట్లు చెప్పారు. మృతురాలితోపాటు ఆమె సోదరి రూమ్‌లో నిద్రపోతున్నారనీ, మెలుకవ రావడంతో ఐదేళ్ళ చిన్నారి, కుటుంబ సభ్యుల కోసం చూస్తూ, కిందకి పడిపోయిందని అన్నారు. 2015లో షార్జా, తల్లిదండ్రులకు నిర్లక్ష్యంపై వార్నింగ్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనీ, లేనిపక్షంలో వారిపైనా కేసులు నమోదు చేయాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణమవుతుండడం బాధాకరమని అపార్ట్‌మెంట్‌ వాసులు, ఇతరులు అభిప్రాయపడ్డారు. అలాగే బాల్కనీ రైలింగ్స్‌ ఎత్తు పెంచాలనీ, కిటికీలకు గ్రిల్స్‌ తప్పనిసరిగా ఉండాలనే సూచనలూ వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com