క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు
- May 23, 2016
జపాన్పై అణుబాంబు దాడికి క్షమాపణ చెప్పబోనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అణుబాంబు దాడి జరిగిన హిరోషిమా ప్రాంతాన్ని ఒబామా త్వరలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జపాన్కు చెందిన ఓ మీడియా సంస్థకు ఒబామా ఇంటర్వ్యూ ఇచ్చారు.అణుదాడికి క్షమాపణ చెబుతారా.. అంటూ ఇంటర్వ్యూలో ఒబామాను ప్రశ్నించగా.. ఒబామా పై విధంగా సమాధానమిచ్చారు. యుద్ధ సమయంలో అప్పటి సందర్భాన్ని బట్టి నేతలు నిర్ణయం తీసుకున్నారని.. దాన్ని ఇప్పుడు తప్పుబట్టలేమని ఒబామా అన్నారు.ఈ వారంలో ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించనున్న మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1945 ఆగస్టు 6న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా ప్రాంతంలో జరిపిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకీ ప్రాంతంలోనూ అణుబాంబు వేయగా.. అందులో 74వేల మంది మరణించారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









