ఎమిరేట్స్ డ్రాలో 25 సంవత్సరాలకు 25,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ వ్యక్తి
- October 21, 2023
యూఏఈ: భారతదేశానికి చెందిన మగేష్ కుమార్ నటరాజన్ రాబోయే 25 సంవత్సరాలకు నెలవారీ Dh25,000 FAST5 గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇది అతన్ని మొదటి గ్లోబల్ గ్రాండ్ ప్రైజ్ విజేతగా, యూఏఈ ఏతర మొదటి విజేతగా చేసింది. ఈ సందర్భంగా మగేష్ మాట్లాడుతూ..తాను మొత్తం ఐదు సంఖ్యలతో సరిపోలినట్లు యాప్లో తనిఖీ చేసినప్పుడు నమ్మలేదని, ఎమిరేట్స్ డ్రా నుంచి కాల్ రాగానే నమ్మినట్లు చెప్పారు. 49 ఏళ్ల అతను భారతదేశంలోని తమిళనాడులోని అంబూర్లో ప్రాజెక్ట్ మేనేజర్. 2019 నుండి ఈ సంవత్సరం ఆరంభం వరకు సౌదీ అరేబియా రాజ్యంలో పనిచేశారు. దుబాయ్కి వెళుతున్నప్పుడు డ్రా గురించి తెలుసుకుని, బహుమతిని గెలుచుకోవాలనే ఆశతో ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చిన మొత్తాన్ని తన కుమార్తెల విద్య కోసం వినియోగించనున్నట్లు, తన కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు మగేష్ వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







