ఎమిరేట్స్ డ్రాలో 25 సంవత్సరాలకు 25,000 దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ వ్యక్తి
- October 21, 2023
యూఏఈ: భారతదేశానికి చెందిన మగేష్ కుమార్ నటరాజన్ రాబోయే 25 సంవత్సరాలకు నెలవారీ Dh25,000 FAST5 గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఇది అతన్ని మొదటి గ్లోబల్ గ్రాండ్ ప్రైజ్ విజేతగా, యూఏఈ ఏతర మొదటి విజేతగా చేసింది. ఈ సందర్భంగా మగేష్ మాట్లాడుతూ..తాను మొత్తం ఐదు సంఖ్యలతో సరిపోలినట్లు యాప్లో తనిఖీ చేసినప్పుడు నమ్మలేదని, ఎమిరేట్స్ డ్రా నుంచి కాల్ రాగానే నమ్మినట్లు చెప్పారు. 49 ఏళ్ల అతను భారతదేశంలోని తమిళనాడులోని అంబూర్లో ప్రాజెక్ట్ మేనేజర్. 2019 నుండి ఈ సంవత్సరం ఆరంభం వరకు సౌదీ అరేబియా రాజ్యంలో పనిచేశారు. దుబాయ్కి వెళుతున్నప్పుడు డ్రా గురించి తెలుసుకుని, బహుమతిని గెలుచుకోవాలనే ఆశతో ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చిన మొత్తాన్ని తన కుమార్తెల విద్య కోసం వినియోగించనున్నట్లు, తన కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు మగేష్ వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









