సామూహిక వివాహ వేడుకలకు హాజరైన దుబాయ్ రాయల్
- October 23, 2023
యూఏఈ: దుబాయ్లో జరిగిన 50 మంది యువ జంటల సామూహిక వివాహ వేడుకకు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని యూఏఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ప్రముఖ ఎమిరాటీ వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్టూర్ మద్దతు ఇచ్చారు. హిల్టన్ దుబాయ్ అల్ హబ్టూర్ సిటీలో జరిగిన ఈ వేడుక జరిగింది. షేక్ మన్సూర్ నూతన వధూవరులకు తన అభినందనలు, సుసంపన్నమైన జీవితం కోసం శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకలో కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలోని సాంఘిక సంక్షేమ సహాయ అండర్ సెక్రటరీ నాజర్ ఇస్మాయిల్, ఖలాఫ్ బిన్ అహ్మద్ అల్ హబ్తూర్, రషీద్ ఖలాఫ్ అల్ హబ్తూర్, పలువురు సీనియర్ అధికారులు, నూతన వధూవరుల కుటుంబాలు, ఇతర అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









