తేజ్ తుఫాను కోసం ఒమన్ సర్వసన్నద్ధం
- October 23, 2023
మస్కట్: తేజ్ తుఫాను ధోఫర్, అల్ వుస్తా గవర్నరేట్లలో తీవ్ర ప్రభావం చూపనుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. తుఫాను (తేజ్) ధోఫర్, అల్ వుస్తా గవర్నరేట్లలోని అనేక విలాయత్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. CAA జారీ చేసిన హెచ్చరిక (2) ప్రకారం, నేషనల్ మల్టీ-హాజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్లోని వాతావరణ చార్ట్ల విశ్లేషణ తుఫాను వర్గం 3 (తేజ్) అక్షాంశం 12.9 °N మరియు రేఖాంశం 54.7 °Eపై కేంద్రీకృతమై ఉందని తెలిపింది. తుఫాను కేంద్రం ఒమన్ తీరానికి 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కేంద్రం చుట్టూ గాలి వేగం 100 నుండి 112 నాట్ల మధ్య ఉంటుందని అంచనా. తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా దోఫర్ గవర్నరేట్ మరియు రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ (ఏఐ మహరా) తీరాల దిశగా కొనసాగుతుందని వెల్లడించింది. ఇది మరో 24 గంటల్లో కేటగిరీ (4) తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో సముద్రం (4-7 మీటర్ల అలలతో చాలా అల్లకల్లోలంగా ఉంటుందని, తుఫాను కారణంగా లోతట్టు తీర ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తుతుందని హెచ్చరించారు. వాడీలు మరియు లోతట్టు ప్రాంతాలను దాటకుండా ఉండాలని సూచించింది. ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లవద్దని కూడా తెలిపింది. మరోవైపు తేజ్ తుఫానుకు సన్నాహకంగా సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రిని ఖాళీ చేయించారు అధికారులు. అలాగే ధోఫర్ గవర్నరేట్లోని సలాలా, రక్యుత్ మరియు ధాల్కుట్లోని విలాయత్లలోని హలానియాత్ దీవులు మరియు తీర ప్రాంతాల నివాసితులను ఖాళీ చేయించారు. ధోఫర్ గవర్నరేట్లో అనేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తేజ్ తుఫాను కారణంగా అక్టోబర్ 23, అక్టోబర్ 24 తేదీలలో దోఫర్ గవర్నరేట్, అల్ వుస్తా గవర్నరేట్లోని అల్ జజీర్ విలాయత్లలో పనులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ కోసం మెయిన్ మిలిటరీ కమిటీ చైర్మన్, ఆపరేషన్స్ అండ్ ప్లానింగ్ అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బ్రిగేడియర్ హమీద్ అబ్దుల్లా అల్ బలూషి అధ్యక్షతన సమీక్షా సమావేశాలు జరిగాయి. సాయుధ దళాలు ఉష్ణమండల తుఫాను ప్రభావాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయని సుల్తాన్ పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









