యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్.. సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే టాప్
- October 24, 2023
యూఏఈ: యూఏఈలో సెకండ్ సాలరీ స్కీమ్ సబ్స్క్రయిబ్ చేసుకున్న వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రత్యేకించి దక్షిణ మరియు ఆగ్నేయాసియా నుండి వచ్చిన ప్రవాసులు తమ ఆదాయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు.ఇటీవల పొదుపు, పెట్టుబడి జాతీయ బాండ్లు, ఎమిరేట్స్ డ్రా ద్వారా రెండవ జీతం పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. నేషనల్ బాండ్స్ సెకండ్ సాలరీ ప్లాన్ కేవలం నెలకు Dh1,000 లతో ప్రారంభమవుతుంది. సబ్స్క్రైబర్లు 3 నుండి 10 సంవత్సరాల వరకు పదవీకాలాన్ని ఎంచుకోవచ్చు. పొదుపు వ్యవధి ముగిసిన తర్వాత వారు ప్రతి నెలా వారి ఎంపిక వ్యవధికి ప్రధాన మొత్తాన్ని, లాభాన్ని ఆదాయంగా స్వీకరిస్తారు.
అదే సమయంలో ఎమిరేట్స్ డ్రా విజేతకు 25 సంవత్సరాల పాటు నెలకు Dh25,000 బహుమతిని అందజేస్తుంది. ఇప్పటివరకు ఎమిరేట్స్ డ్రా విజేతలలో ఎక్కువ మంది దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల జాతీయులే ఉన్నారు. నేషనల్ బాండ్స్ సేవింగ్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ ప్లాన్ లో నమోదు చేసుకున్న మొదటి ఐదు జాతీయులలో.. భారతీయులు (53 శాతం), యూఏఈ జాతీయులు (13 శాతం), ఫిలిపినోలు (8 శాతం), పాకిస్థానీయులు (5 శాతం), జోర్డానియన్లు (2 శాతం) ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









