'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..
- May 23, 2016కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో తమిళ దర్శకుడు దేవరాజ్ (57) మృత్యువాతపడ్డారు. దర్శకుడు దేవరాజ్ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గాయపడిన దర్శకుడు దేవరాజ్, వినాయకమూర్తి, లోగనాథన్, రాజేంద్రన్లను డోన్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్కు గాయాలు కాకపోయినా షాక్కు గురై మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు. కారు వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రహదారి పక్కన గుంతలో పడిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దేవరాజ్ తమిళం, తెలుగులో విజయవంతమైన 'సిందూరపువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్