'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..
- May 23, 2016
కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో తమిళ దర్శకుడు దేవరాజ్ (57) మృత్యువాతపడ్డారు. దర్శకుడు దేవరాజ్ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గాయపడిన దర్శకుడు దేవరాజ్, వినాయకమూర్తి, లోగనాథన్, రాజేంద్రన్లను డోన్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్కు గాయాలు కాకపోయినా షాక్కు గురై మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు. కారు వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రహదారి పక్కన గుంతలో పడిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దేవరాజ్ తమిళం, తెలుగులో విజయవంతమైన 'సిందూరపువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









