'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..

- May 23, 2016 , by Maagulf
'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..

కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో తమిళ దర్శకుడు దేవరాజ్ (57) మృత్యువాతపడ్డారు. దర్శకుడు దేవరాజ్ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గాయపడిన దర్శకుడు దేవరాజ్, వినాయకమూర్తి, లోగనాథన్, రాజేంద్రన్‌లను డోన్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్‌కు గాయాలు కాకపోయినా షాక్‌కు గురై మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు. కారు వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రహదారి పక్కన గుంతలో పడిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దేవరాజ్ తమిళం, తెలుగులో విజయవంతమైన 'సిందూరపువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com