'సిందూరపువ్వు' సినిమా దర్శకుడు మృతి ..
- May 23, 2016
కర్నూలు జిల్లా డోన్ మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఆదివారం జాతీయ రహదారిపై కారు వేగంగా వచ్చి అదుపు తప్పిన ఘటనలో తమిళ దర్శకుడు దేవరాజ్ (57) మృత్యువాతపడ్డారు. దర్శకుడు దేవరాజ్ తన మిత్రులు, బంధువుతో కలసి కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు వేగంగా వెళ్తుండగా ఓబులాపురం వద్ద కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో గాయపడిన దర్శకుడు దేవరాజ్, వినాయకమూర్తి, లోగనాథన్, రాజేంద్రన్లను డోన్ ఆస్పత్రికి తరలించారు. దేవరాజ్కు గాయాలు కాకపోయినా షాక్కు గురై మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు. కారు వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రహదారి పక్కన గుంతలో పడిపోయింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దేవరాజ్ తమిళం, తెలుగులో విజయవంతమైన 'సిందూరపువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష









