త్వరలో.. విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం
- October 29, 2023
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత రెండో ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు విజయవాడలో ప్రాంతీ య పాస్పోర్టు సేవా కేంద్రం(RPSK) మాత్రమే ఉంది. పూర్తిస్థాయి ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పాస్పోర్టుల ముద్రణ, డిస్పాచ్ అంతా విశాఖ కేంద్రంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడకు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాన్ని బందరు రోడ్డు వెంబడి గవర్నర్పేటలోని ఏజీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇకపై పాస్పోర్టు సంబంధిత సమస్యల పరిష్కారానికి రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు విశాఖ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండ దు. కాగా, విజయవాడ పాస్పోర్టు కార్యాలయం కొత్త సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని నూతన రీజనల్ పాస్పోర్టు ఆఫీసర్ కె.శివహర్ష అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ పాస్పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పీవోపీఎ్సకేల్లో రోజుకు సగటున 2వేల చొప్పున ఇప్పటి వరకు 3 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









