కూతురి కోసం నిర్మాతగా మారిన యాక్షన్ కింగ్ అర్జున్.
- May 24, 2016
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న యాక్షన్ కింగ్ అర్జున్. నటుడిగానే కాదు దర్శకుడిగాను తనలోని టాలెంట్ను ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే తన కూతురిని కథానాయికగా ప్రోత్సహించేందుకు అర్జున్ నిర్మాతగాను మారనున్నట్టు తెలుస్తుంది. అర్జున్ కూతురు ఐశ్వర్య పట్టత్తుయానై అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయింది. విశాల్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం మంచి ఫలితాన్ని సాధించకపోవడంతో ఐశ్వర్యకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి 'కాదలిన్ పొన్ వీథియల్' అనే ప్రేమ కథాంశాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. చందన్- ఐశ్వర్య జంటగా రానున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తమిళం, కన్నడ భాషలలో రానున్న ఈ చిత్రాన్ని అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో తాను కనిపించే ప్రయత్నం చేయడంలేదని అర్జున్ తెలిపాడు. మరి అర్జున్ తన కూతురు కోసం నిర్మాతగా మారి చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







