సౌతాఫ్రికా పై భారత్ ఘన విజయం

- November 05, 2023 , by Maagulf
సౌతాఫ్రికా పై భారత్ ఘన విజయం

కోల్ కతా: ప్రపంచ క్రికెట్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ భారీ విజయం సాధించింది. భారత్ 327 పరుగుల లక్ష్యాన్ని పెట్టగా దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 243 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన 37 వ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్ లో బెర్త్ ను పొందాయి. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా జట్టును శాసించాడు. షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com