జైల్లో నిరాహార దీక్షకు దిగిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మది
- November 07, 2023
టెహ్రాన్: నోబెల్ శాంతి బహుమతి-2023 గ్రహీత నర్గీస్ మొహమ్మది సోమవారం జైలులో నిరాహారదీక్షకు దిగారు. అనారోగ్యసమస్యలో బాధపడుతున్న ఆమెను హిజాబ్ ధరించి ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో గతవారం గుండె, ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదని మానవ హక్కుల కమిటీ తెలిపింది.
'ఈ రోజు నర్గీస్ నిరాహార దీక్షకు దిగారు. ఇస్లామిక్ రిపబ్లిక్ విధానం, అనారోగ్యంతో ఉన్న ఖైదీల సంరక్షణను ఆలస్యం చేయడం, ఫలితంగా వారు తీవ్ర అనారోగ్యం పాలవ్వచ్చు లేదా ప్రాణాలను కోల్పోవచ్చు. రెండు ఇరాన్ మహిళలకు మరణం లేదా తప్పనిసరి హిజాబ్ విధానం'ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ ఆమె నిరాహారదీక్షకు దిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
నర్గీస్ గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, కానీ జైలు అధికారులు హిజాబ్ ధరించకుండా ఆస్పత్రికి అనుమతించేందుకు తిరస్కరించారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేవలం ఓఆర్ఎస్ (ఉప్పు, చక్కెర కలిపిన నీరు) మాత్రమే తీసుకుంటున్నారని, మెడిసిన్ తీసుకోవడం లేదని తెలిపారు.
నర్గిస్కు వైద్య సేవలను నిరాకరించడంపై నోబెల్ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధన అమానవీయమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది అనైతికమని.. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను కోరింది.
ఇరాన్లో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆమెను ఇరాన్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆమె 13 సార్లు అరెస్టు అయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం