‘జిగర్తాండ డబుల్ ఎక్స్.‘! లారెన్స్ అండ్ సూర్య పర్పామెన్స్ వేరే లెవల్.!
- November 07, 2023
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్తాండ’ సినిమా తమిళంలో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ పేరుతో తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించింది.
అదే సినిమాకి సీక్వెల్గా రూపొందుతోన్న సినిమానే ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. అయితే, ఈ సినిమాని ఇప్పుడు భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.
దాంతో అంచనాలు పెరిగాయ్. తమిళంతో పాటూ, తెలుగు తదితర భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. లారెన్స్, ఎస్.జె సూర్య ప్రధాన తారాగణంగా ఈ సినిమాలో నటించడం మరో హైలైట్.
మొదటి పార్ట్ తరహాలోనే ఓ గ్యాంగ్ స్టర్కీ, డైరెక్టర్కీ మధ్య నడిచే కథా నేపథ్యంలోనే ఈ సీక్వెల్ కూడా వుండబోతోంది. కానీ, నిర్మాణాత్మకంగా చాలా చాలా ఉన్నతంగా వుండబోతోందట. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ మూవీ అని చెబుతున్నారు.
ఇటీవలే లారెన్స్ రాఘవ ‘చంద్రముఖి 2’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. కానీ, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’కి ఎస్.జె.సూర్య అదనంగా యాడ్ అవ్వడంతో అంచనాలు బాగున్నాయ్. ఆల్రెడీ ‘స్పైడర్’ తదితర సినిమాలతో సూర్య పర్పామెన్స్ లెవల్స్ తెలుగు ఆడియన్స్కీ సుపరిచితమే కదా.!
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









