విలేకరులను బయటకు పంపిన సైన్యం..

- May 25, 2016 , by Maagulf
విలేకరులను బయటకు పంపిన సైన్యం..


విలేకరులను బయటకు పంపిన సైన్యం శ్రీనగర్‌: అసలే మిలిటరీ వాళ్లు నిర్వహించే కార్యక్రమం.. దేశం కోసం ప్రాణాలిచ్చే వారు జాతీయ గీతం పాడుతుంటే కనీసం లేచి నిలబడకపోతే వూరుకుంటారా? జాతీయగీతం పట్ల గౌరవం చూపని వారందరినీ ఉన్నపళంగా అక్కడి నుంచి పంపిచేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగింది. నగర శివారులో జమ్ముకశ్మీర్‌ లైట్‌ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్‌ సెంటర్‌ వద్ద సైనికుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా జెండావందనం చేసి జాతీయ గీతం పాడారు ఆ సమయంలో ఈ కార్యక్రమం కవర్‌ చేయడానికి వచ్చిన స్థానిక కశ్మీర్‌ రీడర్‌, రైజింగ్‌ కశ్మీర్‌ పత్రికలకు చెందిన విలేకరులు లేచి నిలబడకుండా అలాగే కూర్చుని ఉన్నారు. దీంతో ఆగ్రహించిన ఆర్మీ అధికారులు వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే తమను కార్యక్రమం కవర్‌ చేయడానికి ఆహ్వానించారు కానీ అందులో పాల్గొనడానికి కాదు కదా అని ఓ విలేకరి ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో తాను స్టోరీ కోసం నోట్స్‌ రాసుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత విలేకరులను బయటకు పంపిన ఆర్మీ అధికారి కూడా తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పారు. విలేకరులు కూడా జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com