విలేకరులను బయటకు పంపిన సైన్యం..
- May 25, 2016
విలేకరులను బయటకు పంపిన సైన్యం శ్రీనగర్: అసలే మిలిటరీ వాళ్లు నిర్వహించే కార్యక్రమం.. దేశం కోసం ప్రాణాలిచ్చే వారు జాతీయ గీతం పాడుతుంటే కనీసం లేచి నిలబడకపోతే వూరుకుంటారా? జాతీయగీతం పట్ల గౌరవం చూపని వారందరినీ ఉన్నపళంగా అక్కడి నుంచి పంపిచేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో జరిగింది. నగర శివారులో జమ్ముకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ వద్ద సైనికుల పాసింగ్ ఔట్ పరేడ్ జరుగుతోంది. ఇందులో భాగంగా జెండావందనం చేసి జాతీయ గీతం పాడారు ఆ సమయంలో ఈ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చిన స్థానిక కశ్మీర్ రీడర్, రైజింగ్ కశ్మీర్ పత్రికలకు చెందిన విలేకరులు లేచి నిలబడకుండా అలాగే కూర్చుని ఉన్నారు. దీంతో ఆగ్రహించిన ఆర్మీ అధికారులు వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే తమను కార్యక్రమం కవర్ చేయడానికి ఆహ్వానించారు కానీ అందులో పాల్గొనడానికి కాదు కదా అని ఓ విలేకరి ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో తాను స్టోరీ కోసం నోట్స్ రాసుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత విలేకరులను బయటకు పంపిన ఆర్మీ అధికారి కూడా తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పారు. విలేకరులు కూడా జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









