గాయపడిన పిల్లలతో అబుధాబి చేరిన విమానం

- November 18, 2023 , by Maagulf
గాయపడిన పిల్లలతో అబుధాబి చేరిన విమానం

యూఏఈ: యూఏఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు గాజా నుంచి తొలి బ్యాచ్ పాలస్తీనా చిన్నారులు శనివారం ఉదయం అబుధాబి చేరుకున్నారు. ఎమర్జెన్సీ టీమ్‌లు, అంబులెన్స్‌లు ద్వారా చిన్నారులను అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం టార్మాక్ నుంచి ఆస్పత్రులకు తరలించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం అయ్యాయి. మానవతా ప్రయత్నాలలో భాగంగా యూఏఈ చిన్నారులకు వైద్య చికత్సలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 1,000 మంది పాలస్తీనా పిల్లలు యూఏఈ చేరుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com