సౌదీ అరేబియాతో రైలు కనెక్టివిటి పై కువైట్ అధ్యయనం
- November 18, 2023
కువైట్: కువైట్-సౌదీ అరేబియాను కలిపే రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహించడానికి కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. సమగ్ర అధ్యయనం చేసేందుకు SYSRTA కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకార ప్రయత్నం రెండు దేశాల మధ్య సురక్షితమైన రవాణా కోసం కనెక్టివిటీని మెరుగుపరచడం, స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, మహ్మద్ బిన్ సల్మాన్ ల భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుందని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఈద్ అల్-రషీది వెల్లడించారు. కువైట్ - రియాద్ మధ్య 650 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను రానుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే కనెక్టివిటీ ద్వారా ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గుతుంది. అధ్యయనం ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..