సౌదీ అరేబియాతో రైలు కనెక్టివిటి పై కువైట్ అధ్యయనం
- November 18, 2023
కువైట్: కువైట్-సౌదీ అరేబియాను కలిపే రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహించడానికి కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. సమగ్ర అధ్యయనం చేసేందుకు SYSRTA కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకార ప్రయత్నం రెండు దేశాల మధ్య సురక్షితమైన రవాణా కోసం కనెక్టివిటీని మెరుగుపరచడం, స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, మహ్మద్ బిన్ సల్మాన్ ల భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుందని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఈద్ అల్-రషీది వెల్లడించారు. కువైట్ - రియాద్ మధ్య 650 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను రానుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే కనెక్టివిటీ ద్వారా ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గుతుంది. అధ్యయనం ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







