వార్నింగ్ సైరన్లను పరీక్షించనున్న కువైట్
- November 20, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క సాధారణ పౌర రక్షణ విభాగం నవంబర్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు సైరన్ల టోన్ల గురించి పౌరులు, నివాసితులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక(వార్నింగ్) సైరన్లను పరీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైరన్ల వివిధ టోన్లు, సూచనల గురించి అవగాహన కల్పించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ జమాల్ అల్-సాయెగ్ తెలిపారు. సైరన్ టోన్ లేదా సంబంధిత వాయిస్ మెసేజ్ వినబడకపోతే పౌర రక్షణ కార్యకలాపాలకు నంబర్ 25379278కు ఫోన్ చేయాలని ప్రకటన పౌరులను కోరింది. పౌరులు, నివాసితులకు అత్యవసర లేదా ప్రమాదం సంభవించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలను గుర్తు చేయడానికి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







