బిస్కెట్లతో హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి..
- May 25, 2016
మ నదేశంలో ఎంతో మంది పసిపిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. ఇవేమి పైపైన చెబుతున్న మాటలు కావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం.. పోషకాహారలేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తొలి 20 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్ట్రన్ నివేదికలు కూడా ఇదే వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. సరే.. సమస్య ఉందని మనకు తెలుసు. కానీ పరిష్కారం ఏంటి.. అని ఆలోచించిన అలహాబాద్ హోంసైన్స్ కాలేజీ విద్యార్థిని అమ్మాతుల్ ఫాతిమా ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. సూపర్ఫుడ్గా పేర్కొనే స్పైరులినా అనే స్థానిక రకం నాచుతో బిస్కెట్లను తయారు చేసింది. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఈ బిస్కెట్లని నెలరోజుల పాటూ పిల్లలకు పోషకాహారంగా ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ బిస్కెట్లని మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయనుండటం విశేషం
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









