బిస్కెట్లతో హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి..
- May 25, 2016
మ నదేశంలో ఎంతో మంది పసిపిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. ఇవేమి పైపైన చెబుతున్న మాటలు కావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం.. పోషకాహారలేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తొలి 20 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్ట్రన్ నివేదికలు కూడా ఇదే వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. సరే.. సమస్య ఉందని మనకు తెలుసు. కానీ పరిష్కారం ఏంటి.. అని ఆలోచించిన అలహాబాద్ హోంసైన్స్ కాలేజీ విద్యార్థిని అమ్మాతుల్ ఫాతిమా ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. సూపర్ఫుడ్గా పేర్కొనే స్పైరులినా అనే స్థానిక రకం నాచుతో బిస్కెట్లను తయారు చేసింది. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఈ బిస్కెట్లని నెలరోజుల పాటూ పిల్లలకు పోషకాహారంగా ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ బిస్కెట్లని మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయనుండటం విశేషం
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







