బిస్కెట్లతో హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి..
- May 25, 2016
మ నదేశంలో ఎంతో మంది పసిపిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. ఇవేమి పైపైన చెబుతున్న మాటలు కావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం.. పోషకాహారలేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తొలి 20 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్ట్రన్ నివేదికలు కూడా ఇదే వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. సరే.. సమస్య ఉందని మనకు తెలుసు. కానీ పరిష్కారం ఏంటి.. అని ఆలోచించిన అలహాబాద్ హోంసైన్స్ కాలేజీ విద్యార్థిని అమ్మాతుల్ ఫాతిమా ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. సూపర్ఫుడ్గా పేర్కొనే స్పైరులినా అనే స్థానిక రకం నాచుతో బిస్కెట్లను తయారు చేసింది. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఈ బిస్కెట్లని నెలరోజుల పాటూ పిల్లలకు పోషకాహారంగా ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ బిస్కెట్లని మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయనుండటం విశేషం
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









