ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక పై వేధింపులు..అండగా నిలిచిన హక్కుల కమిషన్
- November 21, 2023
అనంతరపురం: ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై ఇంటి యజమానులు వేధింపులకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న IHRPC (అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్) రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవీలు బాధితురాలిని పరామర్శించి అండగా నిలిచారు. వివరాళ్లోకి వెళితే.. నవంబర్ 18న A.P.P వసంత లక్ష్మి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మైనర్ బాలికను ఇంటి యజమానులు వేధించడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు. గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం IHRPC కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో IHRPC రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవిలు, మీడియా సెల్ ఇంఛార్జ్ నబీ రసూల్, ఇతర అధికారులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. బాధితురాలిని పరామర్శించారు. అనంతరం వారి తల్లిదండ్రుల నుండి కేసు వివరాలను సేకరించారు. బాధితులికి న్యాయం జరిగే వరకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. సకాలంలో స్పందించి బాధితురాలికి అండగా నిలిచిన వరప్రసాద, శ్రీదేవీలను IHRPC నేషనల్ ప్రెసిడెంట్ Dr.ముజాహిద్ అభినందించారు.
తాజా వార్తలు
- దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి: సీపీ సీవీ ఆనంద్
- జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- Emirates signs MoU with Crypto.com for future integration of Crypto.com Pay as a payment option for customers
- యాపిల్ సీవోవోగా భారత సంతతి చెందిన సబిహ్ కాన్
- అమెరికాలో క్రికెట్ కప్ గెలిచిన టాలీవుడ్ స్టార్స్..
- గగన్యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
- దుబాయ్లో ఘనంగా జరిగిన వైఎస్సార్ జయంతి
- దుబాయ్ లో డెలివరీ బైక్ రైడర్లకు ఆర్టీఏ గుడ్ న్యూస్..!!
- సౌదీలో 21 నాన్ ప్రాఫిట్ సంస్థలు, 26 వెబ్సైట్లపై చర్యలకు ఆదేశాలు..!!
- సహెల్ యాప్లో గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్.. కువైట్ క్లారిటీ..!!