ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక పై వేధింపులు..అండగా నిలిచిన హక్కుల కమిషన్
- November 21, 2023
అనంతరపురం: ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై ఇంటి యజమానులు వేధింపులకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న IHRPC (అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్) రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవీలు బాధితురాలిని పరామర్శించి అండగా నిలిచారు. వివరాళ్లోకి వెళితే.. నవంబర్ 18న A.P.P వసంత లక్ష్మి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మైనర్ బాలికను ఇంటి యజమానులు వేధించడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు. గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం IHRPC కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో IHRPC రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవిలు, మీడియా సెల్ ఇంఛార్జ్ నబీ రసూల్, ఇతర అధికారులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. బాధితురాలిని పరామర్శించారు. అనంతరం వారి తల్లిదండ్రుల నుండి కేసు వివరాలను సేకరించారు. బాధితులికి న్యాయం జరిగే వరకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. సకాలంలో స్పందించి బాధితురాలికి అండగా నిలిచిన వరప్రసాద, శ్రీదేవీలను IHRPC నేషనల్ ప్రెసిడెంట్ Dr.ముజాహిద్ అభినందించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







