ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- December 09, 2025
మస్కట్: ఒమన్ లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల ఆవిష్కరణకు 100 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన మరియు ఖనిజ మంత్రిత్వ శాఖ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది. ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ ఆధ్వర్యంలో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్లో వేడుకలు జరిగాయి.
1925లో మొదటిసారి ఒమన్ లో ఆయన్ నిక్షేపాలను గుర్తించారు. ఇంధన రంగంలో చోటుచేసుకున్న చారిత్రక మైలురాళ్లను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దోహదపడిన ప్రధాన పరివర్తనలను ఈ సందర్భంగా వివరించారు. ఇదే సమయంలో పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్లో ఒమన్ భవిష్యత్తు వ్యూహాత్మక ప్రణాళికలపై సమీక్షించారు.
చమురు అన్వేషణలో మొదటి అడుగు వేసి శతాబ్దం పూర్తి కావడం ఒక చారిత్రక మైలురాయి అని ఇంధన మరియు ఖనిజ శాఖ మంత్రి సలీం నాసర్ అల్ అవుఫీ అన్నారు. 1925 మే 18న డి'ఆర్సీ ఎక్స్ప్లోరేషన్ కంపెనీతో మొదటి ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత 1955లో "డౌకా-1" బావిని తవ్వడం ద్వారా పునాది దశ ప్రారంభమైందని, ఆ తర్వాత 1967లో ఒమాన్ ముడి చమురు మొదటి రవాణాను మినా అల్ ఫాల్ ఓడరేవు నుండి ఎగుమతి జరిగిందని వివరించారు.
నాడు సగటున రోజుకు 5,000 బ్యారెళ్ల (bpd) ఉత్పత్తి జరుగగా.. నేడు అది ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఈ వేడుకలో ఒమన్ చమురు మరియు గ్యాస్ ప్రయాణ 100వ వార్షికోత్సవానికి గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







