కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- December 09, 2025
కువైట్: కువైట్ లో కొత్తగా కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టం డిసెంబర్ 15నుంచి అమల్లోకి రానుంది. దీనిని మాదకద్రవ్యాలకు వ్యతిరేక పోరాటంలో "భారీ ముందడుగు"గా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభివర్ణించింది. మరోవైపు, కొత్త చట్టంలోని ప్రధాన శిక్షలను హైలైట్ చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అధికారులు అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో భారీ జరిమానాలను విధించనున్నారు. అదే సమయంలో అక్రమ రవాణాదారుల ఆర్థిక వనరులపై ఈ చట్టం దెబ్బకొడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది. గతంలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో జీవిత ఖైదు వేసేవారని,ఇక కొత్త చట్టం ప్రకారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లావాదేవీలకు మరణశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
2024తో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి 11 నెలల్లో డ్రగ్స్ కేసుల సంఖ్య తగ్గిందని డ్రగ్స్ ప్రాసిక్యూషన్ అధిపతి తలాల్ అల్-ఫరాజ్ అన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో 3,251 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం నవంబర్ చివరి వరకు 2,874 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 90 శాతం కేసుల్లో నిందితులు కోర్టులో దోషులుగా తేలారని, ఈ సంవత్సరం జప్తు చేయబడిన మాదకద్రవ్యాల మార్కెట్ విలువ KD 74 మిలియన్లు అని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..







