ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి..బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- November 21, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్కు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించారు. అక్టోబరు 7 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను ముట్టడించింది. దీంతో పరిస్థితులు దారుణంగా మారాయి. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న ఖైదీలకు బదులుగా హమాస్ చేతిలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని ప్రిన్స్ సల్మాన్ అన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్తో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన బహ్రెయిన్.. "దీనిని పరిష్కరించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేయాలి" అని చెప్పింది. వార్షిక మనామా డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్కు ముందు ఆయన మాట్లాడారు. మరోవైపు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఇప్పటివరకు 11,500 మంది పౌరులు మరణించారు.
« Older Article Dubai Taxi Company announces Offer Price Range, start of subscription period for IPO
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి