ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి..బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- November 21, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్కు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించారు. అక్టోబరు 7 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను ముట్టడించింది. దీంతో పరిస్థితులు దారుణంగా మారాయి. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న ఖైదీలకు బదులుగా హమాస్ చేతిలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని ప్రిన్స్ సల్మాన్ అన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్తో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన బహ్రెయిన్.. "దీనిని పరిష్కరించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేయాలి" అని చెప్పింది. వార్షిక మనామా డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్కు ముందు ఆయన మాట్లాడారు. మరోవైపు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఇప్పటివరకు 11,500 మంది పౌరులు మరణించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









