ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి..బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- November 21, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్కు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించారు. అక్టోబరు 7 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ను ముట్టడించింది. దీంతో పరిస్థితులు దారుణంగా మారాయి. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న ఖైదీలకు బదులుగా హమాస్ చేతిలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని ప్రిన్స్ సల్మాన్ అన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్తో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన బహ్రెయిన్.. "దీనిని పరిష్కరించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేయాలి" అని చెప్పింది. వార్షిక మనామా డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్కు ముందు ఆయన మాట్లాడారు. మరోవైపు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఇప్పటివరకు 11,500 మంది పౌరులు మరణించారు.
తాజా వార్తలు
- బైబ్యాక్ ఆప్షన్, సర్వీస్ ఛార్జీలు లేవు: దుబాయ్ డెవలపర్లు..!!
- రియాద్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళల అరెస్ట్..!!
- దుబాయ్ లూప్: ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి హై-స్పీడ్ భూగర్భ రవాణా వ్యవస్థ..!!
- ఫిబ్రవరి 21-22 తేదీలలో ఒమన్ మస్కట్ మారథాన్ 2025..!!
- ఎండోమెంట్ కంపెనీల స్థాపన, లైసెన్సింగ్పై అబుదాబిలో కొత్త నియమాలు..!!
- రమదాన్ ముందు తనిఖీలు.. షువైఖ్లోని తొమ్మిది దుకాణాలకు జరిమానా..!!
- టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసిన హోమ్ మంత్రి అనిత
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం