యూఏఈ లో తగ్గునున్ను చక్కెర ధరలు!
- November 21, 2023
యూఏఈ: ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా యూఏఈలో చక్కెర ధరలు గత రెండు నెలల్లో ఎనిమిది శాతం వరకు పెరిగాయి. అయితే నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఇండియా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. దీంతో యూఏఈలో చక్కెర ధరలు త్వరలో తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ధరలను అదుపు చేసేందుకు భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా, ఈయూ, యూఎస్ లకు ఈ నిబంధనలు వర్తించవు. భారతదేశం తన చక్కెరను ఎగుమతి చేయగల NCEL క్రింద ఉన్న దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాక్ను ప్రధానంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు. ‘‘గత రెండు నెలల్లో స్థానికంగా చక్కెర ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. కానీ భారత చక్కెర స్థానిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ధరలు తగ్గుతాయి, ”అని డాక్టర్ దాతర్ సోమవారం చెప్పారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి