యూఏఈ లో తగ్గునున్ను చక్కెర ధరలు!
- November 21, 2023
యూఏఈ: ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా యూఏఈలో చక్కెర ధరలు గత రెండు నెలల్లో ఎనిమిది శాతం వరకు పెరిగాయి. అయితే నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఇండియా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. దీంతో యూఏఈలో చక్కెర ధరలు త్వరలో తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ధరలను అదుపు చేసేందుకు భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా, ఈయూ, యూఎస్ లకు ఈ నిబంధనలు వర్తించవు. భారతదేశం తన చక్కెరను ఎగుమతి చేయగల NCEL క్రింద ఉన్న దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాక్ను ప్రధానంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు. ‘‘గత రెండు నెలల్లో స్థానికంగా చక్కెర ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. కానీ భారత చక్కెర స్థానిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ధరలు తగ్గుతాయి, ”అని డాక్టర్ దాతర్ సోమవారం చెప్పారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









