యూఏఈ లో తగ్గునున్ను చక్కెర ధరలు!
- November 21, 2023
యూఏఈ: ప్రపంచ ధరల పెరుగుదల కారణంగా యూఏఈలో చక్కెర ధరలు గత రెండు నెలల్లో ఎనిమిది శాతం వరకు పెరిగాయి. అయితే నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా ఇండియా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. దీంతో యూఏఈలో చక్కెర ధరలు త్వరలో తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ధరలను అదుపు చేసేందుకు భారత్ చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా, ఈయూ, యూఎస్ లకు ఈ నిబంధనలు వర్తించవు. భారతదేశం తన చక్కెరను ఎగుమతి చేయగల NCEL క్రింద ఉన్న దేశాల జాబితాలో యూఏఈని కూడా చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న స్టాక్ను ప్రధానంగా బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ తెలిపారు. ‘‘గత రెండు నెలల్లో స్థానికంగా చక్కెర ధరలు ఎనిమిది శాతం పెరిగాయి. కానీ భారత చక్కెర స్థానిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ధరలు తగ్గుతాయి, ”అని డాక్టర్ దాతర్ సోమవారం చెప్పారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







