దొంగతనాలు తనకు కొత్తని.... వదలమని దొంగ ప్రార్థిస
- May 26, 2016
మనామా: తనను లక్ష్యంగా చేసుకొన్న ఓ దొంగ దోపిడీకి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆపై దొరికి పోవడంతో వెంటనే ఆ ఘరానా చోరుడు ప్లేటే ఫిరాయించి ....దొంగతనాలు తనకు కొత్తని....దయచూపి...వదలమని...పోలీసులకు పట్టివ్వవద్దని దొంగ ప్రార్థిస చేయడం మొదలుపెట్టాడు. కువైట్ నగరంలో జరిగిన ఈ ఘటన పలువురికి గమ్మత్తుగా కనబడింది. బాధితురాలి క్షమాభిక్ష కోసం యాచించిన తీరు విడ్డూరంగా కనిపించింది.బాధితుడు దొంగని పట్టుకొని పోలీసులకు అప్పచేప్పుదామని ఎదురుచూస్తున్న సమయంలోనూ దొంగ తన ప్రయత్నాలు మానలేదు.... " నన్ను మన్నించు, మీ వస్తువుని ఎలా దొంగిలించాలో అస్సలు అర్థం కాలేదు,"అంటూదొంగ తన వైఫల్యాన్నిఅంగీకరించాడు. " దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయండి ."ఒక కువైట్ జాతీయుడు రాజధాని లో కువైట్ నగరంలో సందడిగా ఉండే సల్మియ ప్రాంతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తన కారుని వదిలి తర్వాత దుకాణంలో కొనుక్కోంటూ తన కారు వైపు చూస్తున్న సమయంలో ఒక దొంగ తన చేతిని చాచి కారు లోపల ఉన్న డబ్బుని తస్కరించాలని ప్రయత్నం చేయడం గమనించాడు. వెంటనే అక్కడకు వచ్చి దొంగను రెడ్ హేన్డేడ్ గా పట్టుకొన్నాడని బుధవారం " మా గల్ఫ్.కామ్ తెలిపింది.కువైట్ వ్యక్తి దొంగని బలంగా పట్టుకొన్నాడు దీంతో ఆ దొంగ పారిపోవడానికి చేసిన యత్నాలకు ఏ మాత్రం లొంగలేదు. పోలీసు పహారా దళం ఈ దొంగను తీసుకొని సల్మియ పోలీసు స్టేషన్ కు తరలించారు.దొంగ కారు నుంచి దొంగిలించి ప్రయత్నం లో దొరికిపోయాడని తెలిపారు. కాగా ఈ తాజా దొంగ జాతీయత లేదా వయస్సు ప్రస్తావనే తెలపలేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







