వీసా కోసం ఎదురుచూస్తున్న వరుణ్
- May 26, 2016
ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో ఆకట్టుకున్న వరుణ్తేజ్ హీరోగా 'మిస్టర్' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ స్పెయిన్లో 10 రోజులపాటు జరగనున్నట్లు కథ అందించిన గోపీమోహన్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలిపారు. శ్రీధర్ సిపాన 'మిస్టర్' సినిమా డైలాగ్స్ను పూర్తి చేశారని, శ్రీను వైట్ల, టీం షూటింగ్ కోసం అందమైన లొకేషన్స్ని వెతికారని పేర్కొన్నారు. వీసా కోసం ఎదురుచూస్తున్నట్లు పోస్ట్ చేశారు.శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. నల్ల మలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. నాజర్, రఘుబాబు, శ్రీనివాస్రెడ్డి, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్పెయిన్ షూటింగ్ అనంతరం బ్రెజిల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!









