కువైట్లో ఆత్మాహుతి దాడి లో 27 మంది మృతి
- June 27, 2015
కువైట్ రాజధానిలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 27 మంది భక్తులు మరణించారు. ఈ ఘటనకు తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క అనుబంధ సంస్థ ఐన నాజ్డ్ ప్రావిన్స్ సభ్యుడు - అబూ సులైమాన్ అల్ మువహ్హిద్ అనే వ్యక్తి కారణమని తెలియవచ్చింది. ఇతడు, గ్యాస్ కానిస్టార్ లను కలిగియున్న గోడౌన్ ను, డెలివరీ వేన్ తో ఢీకొనటం వలన మొదటి విస్ఫోటనం సంభవించింది. అనంతరం అతడు ఆ కానిస్టార్ లను తెరవాడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరస్టు చేశారు. ఈ ఘటనను, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ, కువైట్ కు బహ్రైన్ మద్దతు ప్రకటించింది. కువైట్ కాబినెట్, ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, రక్షకదళాలను, పోలీసు వారిని అప్రమత్తం చేసి, నేడుసంతాప దినంగా ప్రకటించింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







