గాజాలోకి ప్రవేశించిన 10 యూఏఈ సహాయ ట్రక్కులు
- November 27, 2023
దుబాయ్: మానవతా ప్రయత్నంలో భాగంగా 16,520 ఫుడ్ పార్సెల్స్ సహా మొత్తం 247.8 టన్నులతో నిండిన పది యూఏఈ సహాయ ట్రక్కులు విజయవంతంగా గాజాలోకి ప్రవేశించాయి. ఈ సవాలు సమయాల్లో గాజా స్ట్రిప్లోని పౌరుల బాధలను తగ్గించడం లక్ష్యంగా ఈ మిషన్, ఆపరేషన్ ‘గాలంట్ నైట్ 3’ కింద నిర్వహించినట్లు యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాలను అమలు చేయడంలో, UAE పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. బాధితులకు సహాయం అందించడం, పౌరుల అవసరాలను తీర్చడంలో యూఏఈ స్థాపించబడిన మానవతా దృక్పథానికి ప్రతిబింబంగా ఈ సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







