తెలంగాణలో ‘రైతుబంధు’కు ఇసి బ్రేక్
- November 27, 2023
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మూడు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (EC) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’ సాయం పంపిణీకి రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని సోమవారం ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు నిధులు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సిఇసి ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఇసి అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు నియమాలను ఉల్లంఘించినందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని, లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఇసి షరతు విధించింది. అయితే, రైతుబంధుపై మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఇసి అనుమతి రద్దు చేసింది. దీంతో, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోయింది. దీనిపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పరస్పర విమర్శలకు దిగాయి. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకే రైతుబంధు పంపిణీ ఆగిందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. హరీశ్రావు వ్యాఖ్యల వల్లే ఇసి నిలిపివేసిందని, తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







