భారత పౌరుల సమస్యలను పరిష్కరించిన ఓపెన్ హౌజ్
- November 28, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం రాయబారి వినోద్ కురియన్ జాకబ్ అధ్యక్షతన ఓపెన్ హౌజ్ ను ఏర్పాటు చేసారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రవాసులు పాల్గొన్నారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యల పరిష్కారం పట్ల రాయబారి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు వారి సత్వర మద్దతు మరియు సహకారం కోసం తన కృతజ్ఞతలు తెలియజేశారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ICWF) ద్వారా అవసరమైన భారతీయ పౌరులకు బోర్డింగ్, వసతిని అందించడంతోపాటు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు మరియు టిక్కెట్లను మంజూరు చేయడం ద్వారా ఇంటి పనిమనిషితో సహా కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేస్తూనే ఉందన్నారు. ఓపెన్ హౌజ్ లో పాల్గొన్నందుకు అన్ని భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సభ్యులకు రాయబారి జాకబ్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







