ఎక్స్పో 2030.. సౌదీలో ఘనంగా సంబరాలు
- November 30, 2023
రియాద్: చారిత్రాత్మకమైన వరల్డ్ ఎక్స్పో 2030కి రియాద్ ఆథిత్యం ఇవ్వనుంది. ఈ స్మారక విజయం సౌదీ రాజధానిని అక్టోబర్ 2030 నుండి మార్చి 2031 వరకు షెడ్యూల్ చేయబడిన ఈవెంట్ కోసం ప్రపంచ ఆవిష్కరణ, సాంస్కృతిక మార్పిడి మరియు పురోగతికి కేంద్రంగా నిలిపింది. 119 దేశాల ఆమోదంతో రియాద్ బిడ్ ఆమోదం పొందింది. ఈ నిర్ణయం సౌదీ విజన్ 2030లో వివరించిన అభివృద్ధి, ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సౌదీ అరేబియాను హోస్ట్గా ఎంపిక చేసినందుకు అభినందించారు. రియాద్ ఎక్స్పో 2030 ప్రపంచానికి ఒక ఎక్స్పో అని విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సంతోషం వ్యక్తం చేశారు. రియాద్ ఎక్స్పో 2030లో పాల్గొనే దేశాలకు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తుందని యునెస్కోలోని సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి ప్రిన్సెస్ హైఫా అల్ ముక్రిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







