ఎక్స్పో 2030.. సౌదీలో ఘనంగా సంబరాలు
- November 30, 2023
రియాద్: చారిత్రాత్మకమైన వరల్డ్ ఎక్స్పో 2030కి రియాద్ ఆథిత్యం ఇవ్వనుంది. ఈ స్మారక విజయం సౌదీ రాజధానిని అక్టోబర్ 2030 నుండి మార్చి 2031 వరకు షెడ్యూల్ చేయబడిన ఈవెంట్ కోసం ప్రపంచ ఆవిష్కరణ, సాంస్కృతిక మార్పిడి మరియు పురోగతికి కేంద్రంగా నిలిపింది. 119 దేశాల ఆమోదంతో రియాద్ బిడ్ ఆమోదం పొందింది. ఈ నిర్ణయం సౌదీ విజన్ 2030లో వివరించిన అభివృద్ధి, ఆర్థిక మరియు సామాజిక లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సౌదీ అరేబియాను హోస్ట్గా ఎంపిక చేసినందుకు అభినందించారు. రియాద్ ఎక్స్పో 2030 ప్రపంచానికి ఒక ఎక్స్పో అని విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సంతోషం వ్యక్తం చేశారు. రియాద్ ఎక్స్పో 2030లో పాల్గొనే దేశాలకు మరిచిపోలేని అనుభవాన్ని ఇస్తుందని యునెస్కోలోని సౌదీ అరేబియా శాశ్వత ప్రతినిధి ప్రిన్సెస్ హైఫా అల్ ముక్రిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







