టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనే 20 జట్లు ఇవే..
- November 30, 2023
వన్డే ప్రపంచకప్ సమరం ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి టీ20 ప్రపంచకప్ 2024 పై పడింది. వచ్చే ఏడాది జూన్లో ఈ మెగా టోర్నీ జరగనుంది. యూఎస్, వెస్టిండీస్ జట్లు టీ20 ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా దేశాలు మొదలెట్టాయి. 2022 టీ20 ప్రపంచకప్లో మొత్తం 16 జట్లు పోటీ పడగా ఈ సారి మాత్రం 20 జట్లు తలపడనున్నాయి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ మెగాటోర్నీలో పాల్గొనే 20 జట్ల వివరాలను వెల్లడించింది.
ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. అది ఎలాగంటే.. గత టీ20 ప్రపంచకప్లో టాప్-8లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లలతో పాటు అతిథ్య హోదాలో యూఎస్, వెస్టిండీస్ లతో కలిపి మొత్తం 10 జట్లు నేరుగా అర్హత పొందాయి. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్స్లో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్లు కూడా డైరెక్టుగా అర్హత సాధించాయి.
మిగిలిన 8 స్థానాల కోసం రీజియన్ల వారీగా క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహించారు. అమెరియన్ క్వాలిఫయర్ విన్నర్గా నిలిచిన కెనడా, ఏసియా క్వాలిఫయర్ ఫైనల్కు చేరుకున్న నేపాల్, ఒమన్, ఈస్ట్ ఆసియా-ఫసిఫిక్ క్వాలిఫయర్ విజేత పపువా న్యూ గినియా, యూరోపియన్ క్వాలిఫయర్ ఫైనల్కు చేరుకున్న ఐర్లాండ్, స్కాంట్లాండ్, ఆఫ్రికా క్వాలిఫయర్ పైనల్కు చేరుకున్న ఉగాండ, నబీబియాలు టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించాయి,.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్, కెనడా, నేపాల్, ఒమన్, పపువా న్యూ గినియా, ఐర్లాండ్, స్కాంట్లాండ్, ఉగాండ, నబీబియా
మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కొ గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8లోకి ప్రవేశిస్తాయి. అక్కడ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ పైనల్కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్లో కప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







