రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనo
- May 26, 2016
'కబాలి' సినిమా షూటింగ్ పనులు పూర్తవటంతో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనమయ్యారు. ఈ వేసవి సెలవులను ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాలోనే గడుపనున్నారు. రజనీకాంత్తో పాటు ఆయన అల్లుడు, యువనటుడు ధనుష్, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అమెరికా వెళ్లారు. కళైపులి ఎస్.థాను నిర్మిస్తోన్న కబాలి సినిమా షూటింగ్ పనులన్నీ ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు రజనీకాంత్ రెండు రోజులకు ముందు అమెరికాకు బయల్దేరి వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్లారని తెలుస్తోంది. 'కబాలి' చిత్రం తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో '2.0' చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది. అందుకే ఈ గ్యాప్లో అమెరికాలో రెండు వారాలపాటు గడిపి, జూన్ మొదటివారంలో తిరిగిరానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







