రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనo
- May 26, 2016
'కబాలి' సినిమా షూటింగ్ పనులు పూర్తవటంతో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనమయ్యారు. ఈ వేసవి సెలవులను ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాలోనే గడుపనున్నారు. రజనీకాంత్తో పాటు ఆయన అల్లుడు, యువనటుడు ధనుష్, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అమెరికా వెళ్లారు. కళైపులి ఎస్.థాను నిర్మిస్తోన్న కబాలి సినిమా షూటింగ్ పనులన్నీ ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు రజనీకాంత్ రెండు రోజులకు ముందు అమెరికాకు బయల్దేరి వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్లారని తెలుస్తోంది. 'కబాలి' చిత్రం తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో '2.0' చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది. అందుకే ఈ గ్యాప్లో అమెరికాలో రెండు వారాలపాటు గడిపి, జూన్ మొదటివారంలో తిరిగిరానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







