రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనo
- May 26, 2016
'కబాలి' సినిమా షూటింగ్ పనులు పూర్తవటంతో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు పయనమయ్యారు. ఈ వేసవి సెలవులను ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాలోనే గడుపనున్నారు. రజనీకాంత్తో పాటు ఆయన అల్లుడు, యువనటుడు ధనుష్, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అమెరికా వెళ్లారు. కళైపులి ఎస్.థాను నిర్మిస్తోన్న కబాలి సినిమా షూటింగ్ పనులన్నీ ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు రజనీకాంత్ రెండు రోజులకు ముందు అమెరికాకు బయల్దేరి వెళ్ళారు. ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్లారని తెలుస్తోంది. 'కబాలి' చిత్రం తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో '2.0' చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది. అందుకే ఈ గ్యాప్లో అమెరికాలో రెండు వారాలపాటు గడిపి, జూన్ మొదటివారంలో తిరిగిరానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









