బిఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కెసిఆర్ ఎన్నిక
- December 10, 2023
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బిఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో తమ లీడర్ గా కెసిఆర్ ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







