ఈ నెల 14న ఏపీ కేబినెట్ సమావేశం
- December 11, 2023
అమరావతి: ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి భేటీ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సన్నాహక సమావేశం జరుగనుంది. కేబినెట్ ముందుకు వచ్చే అంశాల పై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది. ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది.
కాగా, వైఎస్ఆర్ లా నేస్తం రెండో విడత నిధులను ఈరోజు సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులు ఉన్నారు. వారికి నెలకు రూ. 5,000 చొప్పున 6 నెలల స్టైపెండ్ రూ. 30,000 జమ చేస్తారు. ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 7,98,95,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 రెండు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







