ఆర్టికల్ 370 రద్దు పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- December 11, 2023
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్దమేనా అన్నదాని పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వేరువేరు పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పును వెలువరించింది. తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపించారు. పిటీషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. పిటిషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం, కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 రద్దుపై ఏకాభిప్రాయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఒకసారి భారతదేశంలో కలిసిపోయాక జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదని, జమ్ము కశ్మీర్ ను దేశంలో కలుపుకోవడానికి ఆర్టికల్ 370 ఉద్దేశం.. దేశం నుంచి వేరు చేయడానిక కాదని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 370 తాత్కాలికమైనది మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష