సిఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఇప్పటికే జంట నగరాల పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ప్రభుత్వం మార్చింది. తాజాగా మరో మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షానవాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్నారు.
మరోవైపు హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ చౌహాన్ లను డీజీపీకి అటాచ్ చేశారు. వీరికి ఇంకా పోస్టింగ్ లు ఇవ్వలేదు. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యను నార్కోటిక్స్ వింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు.
తాజా వార్తలు
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ









