ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్కు తరలించడం లేదు: ఏపీ ప్రభుత్వం
- December 12, 2023
అమరావతి: వైజాగ్ కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు దాఖలు చేసిన పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని కార్యాలయాలను విశాఖకు ప్రస్తుతం తరలించడం లేదని తెలిపింది. కార్యాలయాలు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయాలను తరలించడం లేదని హైకోర్టుకు సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









